CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమదానం లో పాల్గొన్న ఎంపీపీ

Share it:





 మన్యంటీవీ, అశ్వారావుపేట: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అశ్వారావుపేట మేజర్ పంచాయితీలో రింగ్ రోడ్ సెంటర్ లో నిర్వహించిన  శ్రమదానం కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొని శ్రమదానం చేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట మండలం మొత్తం సస్యశ్యామలంగా వుండి ఆకుపచ్చని తోరణం ల పరిశుభ్రంగా వుండి మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో వుండాలని, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలపెట్టిన ఈ హరిత హారం పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రం లోనే అశ్వారావుపేట మండలం ముందు వుండాలని, రాష్ట్రానికే అశ్వారావుపేట మండలం ఆదర్శంగా నిలవాలని అందుకు మండలంలోని అధికారులూ ప్రజా ప్రతినిధులు కలసి పని చేయాలనీ అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటూ ఆర్డిఓ స్వర్ణలత, ఈఓఆర్డీ సీత రామరాజు, స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి , సర్పంచ్ అట్టం రమ్య, ఈఓ  హరికృష్ణ, యుఎస్ ప్రకాష్, గ్రామ పంచాయితీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: