మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆమె హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతూ ఆదివారం ఇల్లందు పట్టణంలోని హరి హర క్షేత్రం దేవాలయం లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ త్వరగా కరోనా నుంచి కోలుకుంటారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి వి కృష్ణారావు, మేకల శ్యామ్, మహేందర్, రాజేష్, నెమలి ధనలక్ష్మి, రాజోరి మంజుల, కొక్కు సరిత, చంద్రావతి, రాజురి వైశాఖ, నిఖిల్ చక్రవర్తి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: