【అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ ✊✊✊】
మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:; అఖిల భారత రైతు కూలీ సంఘం సమావేశం. అన్నపురెడ్డిపల్లి మండలం,కొండాయిగూడెం గ్రామంలో కారం వెంకటేశ్వర్లు అధ్యక్షతన, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఎస్కె ఉమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమర్ మాట్లాడుతూ, 40 సంవత్సరాల నుండి గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూమిలో, అటవీశాఖ అధికారులు హరితహారం పేరుతో, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపివేయాలని. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు వ్యవసాయ భూములకు, అటవీ హక్కుల చట్టం అమలు చేసి, హక్కు పత్రాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కారం నాగేష్, బోర్ర నాగేశ్వరరావు, ప్రసాద్, కుంజా సాయిబాబు, కుంజా రాములు, వెంకటేశ్వర్లు, వీదప్ప, తదితర గిరిజనులు పాల్గొన్నారు.
Post A Comment: