మన్యం టీవీ ఏటూరు నాగారం
టిపిసిసి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ఈ కార్యక్రమానికి వెళ్లకుండా శుక్రవారం రోజున ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను రాజభవన్ ముట్టడిలో భాగంగా ఏటూరు నాగారం కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉదయం ఐదు గంటలకు కు పోలీసు వారు ముందస్తు చర్యగా ఉదయం ఐదు గంటలకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లలోకి వెళ్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టీపిసిసి అధ్యక్షుడిగా నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ధర్నా రాస్తారోకో పై ఒత్తిడి తీసుకురావడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, యూత్ అధ్యక్షులు ముస్తఫా, మండల నాయకులు ముక్కెర లాలయ్య, వార్డు మెంబర్లు పడిదల హనుమంతు,చిక్కుల విజయ్, గద్దల శ్రీ రాములు అరెస్టయిన వారిలో ఉన్నారు.
Post A Comment: