CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలి

Share it:

 



*సర్పంచ్ ఈసం రామ్మూర్తి.

 మన్యం టీవీ ఏటూరు నాగారం                         

                                                                          అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలని సర్పంచ్ ఈసం రామ్మూర్తి అన్నారు.

కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ నిరుపేదలు చాలామంది కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని,మీ సేవలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడానికి మీసేవ కేంద్రాలకు వెళ్తే మీ సేవా కేంద్రాలలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకోవడం లేదని పలు రేషన్ కార్డు లేని నిరుపేదలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు.ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.                                మూడేళ్లుగా పింఛన్లు లేవు.                              గత మూడు సంవత్సరాలుగా కొత్త పింఛన్లు మంజూరు లేదని దీంతో నిరుపేద వికలాంగులు వృద్ధులు వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పలుమార్లు కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా కొత్త పింఛన్ల కోసం ప్రదక్షిణాలు చేస్తూ ఆలసి పోతున్నారని.రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయాలని కోరారు.

Share it:

Post A Comment: