గుండాల ఆళ్ల పల్లి జులై 28 (మన్యం మనుగడ) కుక్కలను తప్పించబోయి తాను గాయాలపాలైన సంఘటన ఆళ్ల పల్లి మండలం పరిధిలోని రాఘవాపురం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం లోని బొడు కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎట్టి నగేష్ మర్కోడు గ్రామం లో ఉన్న బంధువుల ఇంటి వద్దకు వచ్చి వెళుతున్న క్రమంలో రోడ్డుమీద ఉన్న కుక్కలను తప్పించబోయి ద్విచక్ర వాహనం పై నుండి కేంద్ర కేంద్ర పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆళ్ల పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు
Post A Comment: