మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తాసిల్దార్ కుసుమ రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పి కోఆప్షన్ సభ్యులు వాలియబి సలీం,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,ఎంపీటీసీలు గుడ్ల శ్రీలత దేవేందర్,కుమ్మరి సప్న చంద్రబాబు,పర్వతాల భరత్ కుమార్, ఏటూరు నాగారం గ్రామ సర్పంచ్ ఈసం రామ్మూర్తి,రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ హాజరై మాట్లాడుతూ మండల కేంద్రంలో కొత్తగా 350 రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగిందని,వీరికి ఆగస్టు నెల నుండి నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. వీఆర్వోలు రాములు, పాండయ్య, జనార్ధన్, నరసయ్య, గ్రామ సేవకులు గంపల శంకర్,గద్దల కృష్ణ, విజయ,బత్తుల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: