నీటి కోసం రాస్తారోకో చేసిన జానంపేట ప్రజలు
మన్యం మనుగడ, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట పంచాయితీలో గల దుబ్బ గుంపులో వర్షాకాలం వచ్చినప్పటికీ నీటి గోస తీరడం లేదు. విసిగి వేసారిపోయిన జానంపేట పంచాయతీ దుబ్బ గుంపు ప్రజానీకం, పంచాయితీ నుండి నీటి సౌకర్యం కల్పించాలని ఏటూరునాగారం మణుగూరు జాతీయ రహదారిపై కొద్దిసేపటి వరకు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా దుబ్బ గుంపు ప్రజలు మాట్లాడుతూ నీటి ఎద్దడి గురించి పలుమార్లు పంచాయతీ పాలకవర్గానికి, అధికారులకు విన్నవించుకున్నామని, ఇంతవరకు ఎలాంటి స్పందన వారి నుంచి రాలేదని తెలియజేశారు.ఇదే కారణంతో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించామని, మా ఆవేదనను ప్రభుత్వ అధికారులు గుర్తించి, నీటి సౌకర్యం కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు గోవర్ధన్, దుబ్బ గుంపు ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: