మన్యం టీవీ : జూలూరుపాడు, జులై 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు సరిపడా అందించలేక పోతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వనికి బాధ్యత లేదనీ ధ్వజమెత్తారు. మండల పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు వ్యాక్సిన్ కోసం వస్తే స్టాక్ లేదని పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారానికి ఒకటి, రెండు, రోజులు మాత్రమే వ్యాక్సినేషన్ వేస్తున్నారని, అలాంటి పద్ధతి లేకుండా ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రతీ రోజు ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలకు మొబైల్ వాహనం ద్వారా వ్యాక్సిన్ అందించి ఆయా గ్రామ పంచాయితీలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ.. జిల్లా ఆరోగ్య యంత్రాంగం తక్షణమే స్పందించి ప్రజా ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని కోరారు. కరోనా మూడవ దశ ముంచుకొస్తుందని ప్రచారాలు జరుగుతున్నాయని,మండల ప్రజలకు తక్షణమే కరోనా వ్యాక్సినేషన్ వేయించే కార్యక్రమం చేపట్టాలని,ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు సామాజిక దూరం పాటించే విధంగా అవగాహన కల్పించాలని, మండల వైద్య అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సమితి నాయకులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు,చింతా స్వరాజ్యరావు,యల్లంకి మధు,దేవినేని జనార్దన్ రావు,షేక్ నాగుల్ మీరా,నాగరాజు,షేక్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: