మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రమైన సతీష్ గడ్ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి కోవాసి లక్మ తనయుడు కుసుమ జిల్లా పరిషత్ చైర్మన్ హరీష్ కోవాసి కుంట యూత్ కాంగ్రెస్ జిల్లా మహా మంత్రి బి రుద్ర కుమార్ లు గురువారం నాడు జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన కట్రం నర్సింహరావు, కట్రం మోహనరావు, కాజా రమేష్,లను గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా హరీష్ కోవాసి మాట్లాడుతూ.. హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కు చెందిన మిత్రులను కలవడానికి ఆగినట్లు తెలిపారు. హరీష్ కోవాసి ని కలుసుకునేందుకు చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాబీర్ హుస్సేన్, ఆదివాసీ నాయకులు సంఘం నాగరాజు,బొర్ర సురేష్, బీసీ నాయకులు గోసు రామారావు, కుసుమ జిల్లా పరిషత్ చైర్మన్ కలిసి అభినందనలు తెలిపారు.
Post A Comment: