మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రము నందు గురువారం "ద ఆర్ట్ ఆఫ్ లివింగ్" వారి సౌజన్యంతో ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ సంస్థ ఇంటర్నేషనల్ లెవల్లో ఎన్నో దేశాల్లో వారి సేవలను కొనసాగిస్తుందని కొనియాడారు. కరోనా కష్ట సమయంలో ఆర్థిక స్తోమత లేని పేషెంట్లకు పి హెచ్ సి లలో వీటి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వ్యాప్తంగా 13 పి హెచ్ సి లకు ఆక్సిజన్ కాన్సట్రేటర్ లను అందజేసిన "ద ఆర్ట్ ఆఫ్ లివింగ్" వారికి కృతజ్ఞతలు తెలిపారు. సుజాతనగర్, చండ్రుగొండ, ఎర్రగుంట, జూలూరుపాడు, పి హెచ్ సి ల వైద్యులకు ఎమ్మెల్యే రాములు నాయక్ "ఆక్సిజన్ కాన్సట్రేటర్" లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, పార్టీ అధ్యక్షులు నరసింహారావు, సర్పంచ్ విక్రమ్, ఎంపీటీసీలు రాజశేఖర్, సతీష్ కుమార్, మధుసూదన్ రావు, పార్టీ నాయకులు పొన్నెకంటి వీరభద్రం, ఎంపీడీవో చంద్రశేఖర్, వైద్యాధికారి వీరబాబు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: