మన్యం టీవీ, కొత్తగూడెం, జులై 21 :- భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ముక్తాబాయి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ జ్యోతి అనాధ వృద్ధాశ్రమంలో కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. బుధవారం వృక్ష మిత్రుడు, మొక్కల ప్రేమికుడు, మొక్కల వెంకటయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆశ్రమంలో ఉన్న సుమారు పాతిక మందికి ఉచితంగా మందుని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ...ఈ మందు వలన రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని, తద్వారా కరోనా బారినుండి కాపాడుకోవచ్చని తెలిపారు. వృద్ధులకు, అనాథలకు సేవ చేయాలనే పట్టుదలతో, చిరు ఉద్యోగాలు చేసుకుంటూ, భార్య భర్తలు వారి పిల్లల సమిష్టి కృషి తో అనాధ ఆశ్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమ నిర్వాహకులు జ్యోతి, హరి లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు రామంచి శ్రీనివాస్, కొయ్యడ వెంకటేశ్వరరావు, కూరగాయల శ్రీనివాస్, సుధీర్, సుగుణ రావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: