మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 21:- గైర్హాజరు కారణంగా తొలగింపునకు గురైన కార్మికులకు కంపెనీ తిరిగి ఇస్తున్న ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ (పా) ఎన్.బలరాం సూచించారు. 2000. జనవరి 1 నుంచి 2018 డిసెంబర్ 31 మధ్య 100 హాజర్లు కలిగి ఉండి తొలగింపునకు గురైన 46 ఏళ్ల లోపు కార్మికులకు తిరిగి మరోసారి ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన నేపథ్యంలో బుధవారం కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు 22 మందికి 18 మంది కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. ఈ ఈ కార్యక్రమంలో జీఎంలు ఆనందరావు, వెంకటేశ్వర రెడ్డి, వెంకటరమణ, సురేష్ బాబు, ఎంజీఎం హనుమంతరావు, డీజీఎం కవితా నాయుడు, డి వైపీఎం లు అశోక్, తిరుపతి పాల్గొన్నారు.
Navigation
Post A Comment: