*జడ్పీ ఫ్లోర్ లీడర్ తుమ్మల హరిబాబు దాతృత్వం 15 క్వింటాల బియ్యం అందజేత.
మన్యం టీవీ ఏటూరు నాగారం
గోవిందరావుపేట
మండలంలోని చాల్వాయి గ్రామ శివారులో ఉన్న జారుడు బండ గుత్తి కోయగూడెంలో 15 గుత్తి కోయ కుటంబాలకు15 క్వింటాల బియ్యంతో నిత్యావసర సరుకులతో, పాటుగా వారికి కావలసిన దుస్తులను కూడా అందజేసినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవిందరావు పేట గ్రామంలో జులై 1నుండి 10వ తేదీ వరకు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వారు గ్రామం యొక్క అభ్యున్నతి కొరకు వారు పాటు పడడం జరిగిందని.వారికి అండగా ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం వారి యొక్క సమస్యల గురుంచి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారిని ఎల్లా వేళలా కాపాడు కపడుకోవాల్సిన అవసరం ఉందని,మునుముందు వారి కష్టా సుఖలలో వారికి అండగా ఉంటానని తెలియజేసారు.
ఎటువంటి ఆసరా లేకుండా, నిరాదరణకు గురై, అడవిలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద గుత్తికోయ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వారికి ఈ సహాయం చేయడం జరిగిందని తెలియజేసారు.ఈకార్యక్రమంలో ఎంపీటీసీ ఆలూరు శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు బాబర్,పిఎసిఎస్ డైరెక్టర్ మచినేని సాంబశివరావు,నాయకులు వెలిశాల వెంకన్న, బొల్లం శివ, తుమ్మల శివ, కీర్తి రవి, కొత్తూరు వెంకటరామయ్యా, ఫక్రుద్దీన్, మునిగల వెంకన్న, జన్ను కరుణాకర్, దారా కిరణ్, కొండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: