మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 20 :- మంగళవారం నాడు ఎదురుగడ్డ గ్రామపంచాయతీలో లెప్రసీ కాలనీ లో తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక జేఏసీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ గంగు భానుమూర్తి జయంతి సందర్భంగా సుమారు 80 మంది దివ్యాంగులకు,కుష్టు వ్యాధి గ్రస్తులకు, పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేసారు, ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని కీర్తిశేషులు బ్రహ్మశ్రీ గంగు భానుమూర్తి జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేసి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గొప్ప సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చక జేఏసీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా తాను అంగవైకల్యంతో ఉన్న, చదువుల అభ్యసించిన తోటి దివ్యాంగుల సమస్యలతోపాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం(టి వి పి ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర విజేఏసీ చైర్మన్ సతీష్ గుండపునేని అర్చకులు జేఎసి సభ్యులు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో అర్చక జేఏసీ సభ్యులు రాధాకృష్ణ, ప్రసన్న రామకృష్ణ, ప్రసాద్, విజేఎసి జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: