పీ వై ఎల్ నాయకులు ఎనుగంటి లాజర్
గుండాల జూలై 18 (మన్యం మనుగడ) నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పీ వై ఎల్ నాయకులు ఎనుగంటి లాజర్ అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని జగ్గు తండ గ్రామంలో ప్రదర్శన నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచినప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఏండ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్లు వెలువడక పోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు అట్టి కం శేఖర్, జర్పుల కిషన్, బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: