👉హరితహారమే మనిషికి జీవన హారం" వక్తల పిలుపు
👉భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రం ప్రగతి మైదానం నల్లపోచమ్మ గుడి ఆవరణలో మొక్కలు నాటారు.
మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 18:- జిల్లా అధ్యక్షుడు సిద్దెల రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస రావు, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ "హరిత హారమే ప్రాణికి - జీవన హారం అని అన్నారు. సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు జీవకోటి మనుగడకు గొప్పధర్మం భోధించాడని, ఆయన మార్గంలో సామ్రాట్ అశోక చక్రవర్తి లక్షలాది మొక్కలు నాటి, పర్యావరణం సంరక్షణ చేశారని, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణం కాలుష్యం నుంచి కాపాడాలని, కంప్యూటర్ యుగంలో పర్యావరణ పరిరక్షణ బాధ్యత మరిచారని, బుద్ధుడు బోధించిన శాంతి ప్రేమ కరుణ దయా అహింసా పంచశీల మార్గాలు మానవాళికి ఎంతో అవసరం అని అన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సిద్దెల రవి అధ్యక్ష వహించగా జిల్లా కార్యదర్శి కొచ్చెర్ల కమళా రాణి , జిల్లా కోశాధికారి శ్రీమతి పద్మావతి, ప్రముఖ ప్రకృతి ప్రేమికులు రాజశేఖర్, తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల వేదిక అధ్యక్షుడు గుండపనెని సతీష్, గుడివాడ రాజేందర్, జేఏసీ జిల్లా అధ్యక్షులు కోండ్రు శ్రీహరి, అంకూస్,లక్ష్మీ నారాయణ, ఐక్య తల్లిదండ్రుల వేదిక రత్నాకర్, దిశా సభ్యులు మాధవీలత, రొడ్డా సావిత్రి ఆలయ నిర్వాహకులు ఎజ్జల లక్ష్మి , రాహుల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: