మన్యం టీవీ కొత్తగూడెం జూలై 8:- టియుడబ్ల్యూ జె (టి జె ఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఈరోజు స్వర్గీయ సీనియర్ సింగరేణి జర్నలిస్ట్ (ఆంధ్రజ్యోతి) కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది.అదే విధంగా వారికి బియ్యం మరియు కిరాణా నిత్యావసర సరుకులు అందించటం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ దేవకృష్ణ కుటుంబానికి టి జె ఎఫ్ జిల్లా నాయకత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ ద్వారా పెన్షన్ మరియు ఆర్ధిక సహాయాన్ని త్వరగా అందేలా చేస్తామని అన్నారు.పరామర్శించిన వారిలో జిల్లా గౌరవ అధ్యక్షులు చండ్ర నరసింహారావు,టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి,ఉపాధ్యక్షులు ఏ. లక్ష్మణ్,నరసింహారావు,మోటమర్రి రామకృష్ణ,ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు మహమ్మద్ షఫీ,ఈశ్వర్,సీమకుర్తి రామకృష్ణ, చిరంజీవి చింతల, కాకటి బాబు,రాజ్ కుమార్,అఫ్జల్,మజీద్,నజీర్,హతిరామ్ లు ఉన్నారు.
Post A Comment: