-ఉప్పతల ఏడుకొండలు
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
హరితహారం కార్యక్రమం లో భాగంగా మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో భాగంగా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాయని హరితహారం వల్ల గ్రామాల్లో కూడా స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు. ప్రజలందరూ ముందు తరాల మనుగడ కోసం స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లిపెద్ది లక్ష్మీ భవాని, జెట్పి కో ఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, ఎంపీటీసీ దారా బాబు, ఉప సర్పంచ్ దిబ్బెందుల బాబురావు, మండల నాయకులు మేడ మోహన్ రావు, గాదె శివప్రసాద్, సురా వెంకటేశ్వర్లు, మల్లిపెద్ది నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: