CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పండ్ల దుకాణం ప్రారంబించిన జడ్ పి టీ సి సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం లోని చవిటి-1 గ్రామ మహిళా సమాఖ్య  పరిది లోని రాధా కృష్ణ స్వయం సహాయక సంఘం సభ్యురాలు మల్లెల రమాదేవి కి ముఖ్య కార్యనిర్వాహణ అదికారి సెర్ప్ వారి ఆదేశాల ప్రకారం రూరల్ అవుట్ లెట్ పథకం క్రింద బ్యాంక్ లింకేజి ద్వార 100000 లు అప్పుగ మంజూరు చేయడం జరిగింది.దీని ద్వార సదరు సభ్యురాలు ఈరోజు పండ్ల దుకాణం ఏర్పాటు చేసుకోవడం,ఈ కార్యక్రమం లొ భాగంగ  జెడ్ పి టి సి సభ్యురాలు సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పండ్ల దుకాణం ను ప్రారంబించడం జరిగింది.ఈ సందర్భంగ వారు మాట్లాడుతు స్వయం సహాయక సంఘ సభ్యులు పొదుపులు,అప్పులు సక్రమంగ నిర్వహించుకుంటు ఈ విదంగ వ్యాపార ఆదాయ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.అదేవిదంగ స్వయం సహాయక సంఘాల యెక్క పని తీరు ను అభినందించడం జరిగింది.ఇదే విదంగ స్వయం సహాయక సంఘాల్లోని మహాళలందరు కూడ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకుంటు తద్వార వచ్చే ఆదాయం ద్వారా వారి కుటుంబాలను అబివృద్ది చేసుకోవాలని తెలియజేసారు.ఈ కార్యక్రమం లొ పంచాయితి సర్పంచ్ భానోత్ శారద,సెర్ప్ ఎ పి యం శ్రీరాం సత్యనారాయణ,సెర్ప్ సి.సి బచ్చలకూరి ప్రసాద్,పంచాయితి కార్యదర్శి సగ్గుర్తి కృష్ణ చైతన్య,వి ఓ ఏ కె.స్వరూప రాణి మరియు యస్ హెచ్ జి సభ్యులు రమాదేవి, సరిత,నాగరాణి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: