మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 11,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి బిజెపి రావడానికి బిజెపి కార్యకర్తలు అందరు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని అన్నారు. బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్త ఎంపీగా గెలుపొంది మచ్చలేని మహానాయకుడని, దేశభక్తి గల నాయకుడని, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బండి సంజయ్
నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని,బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, గ్రామ పంచాయతీ 3వ,వార్డ్ నెంబర్ చిలుకూరి నాగమణి, సత్యవతి ,నాగమణి కొమ్మినేని సత్యనారాయణ, జేష్ట నరేష్, సిరిపురపు పుల్లా రావు, గోపాల్ రావు, వందనపు సుబ్బు, కొండ సత్యనారాయణ, వెంకట్, లాలయ్య , కిరణ్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: