మన్యం మనగడ ,అశ్వాపురం: డీజిల్ పెట్రోల్ మరియూ వంట గ్యాస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ధరలు పెంచి ప్రజల నెత్తిన భారం పడే విధానాన్ని ఖండిస్తూ. ఏఐసిసి మరియు టిపిసిసి ఆదేశాల మేరకు ఈరోజు అశ్వాపురం మండలం లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రపక్షమైన సిపిఐ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతోర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవ రెడ్డి, ఓరుగంటి బిక్షమయ్య,మల్లెల మడుగు ఎం పి టి సి రామకృష్ణ మరియు సిపిఐ పార్టీ అనంతనేని సురేష్ , వేల్పుల మల్లికార్జున్, బచ్చు వెంకట రమణ,చంచల రాము, చెన్నయ్య ,కాకా రాములు, చింతకాయల రవి, ఏస్ కే మోసిన్, కాళిదాస్, టాటా ఏసీ యూనియన్ నుంచి క్రాంతి కిరణ్ ,ఆటో యూనియన్ సతీష్, రమణయ్య ,బాబు ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: