మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి
గుండాల జూలై 10 (మన్యం మనుగడ ) మూడు రోజుల్లో మంచినీరు మిగిలిన ఇండ్లకు అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలో పర్యటించిన ఎర్రబెల్లి దయాకర్ రావు , పువ్వాడ అజయ్ కుమార్ లు మండల కేంద్రంలో పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. సభలో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయని అడగగా సభలోని మహిళలు రావటం లేదని మంత్రికి తెలపడంతో వారు మిషన్ భగీరథ అధికారులను పిలిచి నీళ్లు రాణి ప్రతి ఇంటికి మంచినీరు నల్ల విధించాలని ఆదేశించారు. దానితోపాటు స్మశాన వాటికలో కూడా తప్పకుండా మిషన్ భగీరథ నల్ల బిగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు , మహబూబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు మాలోత్ కవిత , జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య , బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ అనుదీప్ , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
Post A Comment: