పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య
మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత
గుండాల జూలై 10 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండలంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య , మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మర్కోడు పంచాయతీలోని రైతు వేదిక అదే గ్రామ సమీపంలో గల చెక్ డ్యామ్, వీటితో పాటు తునికి బండల గ్రామ సమీపంలోని వంతెనను దానితోపాటు ఆళ్ల పల్లి గ్రామంలో గల నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ మరియు రైతు వేదికను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు
Post A Comment: