CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీల సంక్షేమమే జిల్లా పోలీసుల లక్ష్యం.

Share it:

 


మన్యం టీవీ, కరకగూడెం:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మణుగూరు  ఏఎస్పీ P.శబరిష్ IPS గారి పర్యవేక్షణలో ఈరోజు కరకగూడెం మండలంలోని అంగరిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ఫిల్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సిఐ శ్రీ దోమల రమేష్ గారు గ్రామానికి చెందిన వలస గిరిజన కుటుంబాలకు ఇంటికొక వాటర్ ఫిల్టర్ ను ఆదివాసీలకు అందజేశారు. త్వరలో మిగితా గ్రామాలకు చెందిన వలస ఆదివాసీ కుటుంబాలకు కూడా వాటర్ ఫిల్టర్స్ ను పంపిణీ చేస్తామని తెలిపారు.ఏజెన్సీలో నివసించే ఆదివాసీలకు సురక్షిత నీటిని అందించేందుకు ఈ ఫిల్టర్లు పంపిణీ చేశామని చెప్పారు.వీటిని సద్వినియోగం చేసుకొని అంటువ్యాధులు రాకుండా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ గిరిజన యువత చెడు మార్గాలలో నడవకుండా బాగా చదువుకుని పలు రకాల క్రీడల్లో పాల్గొని తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

    

  ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్ఐ జి.ప్రవీణ్ కుమార్,ట్రైనీ SI P.గణేష్ ,ట్రైనీ RSI సుమంత్ మరియు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ సిబ్బంది మరియు సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: