మన్యం టీవీ, అశ్వాపురం:మావోయిస్ట్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అశ్వాపురం మండలం లో సీ ఐ సట్ల రాజు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ లు చేస్తున్నారు. మావోయిస్ట్ వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంచ నీయ సంఘటన లు జరగకుండా పోలీసులు వాహనాలు క్షుణ్నంగా తనిఖీ చేసి ధృవ పత్రాలు పరిశీలించి వాహనాలు సోదాలు చేసి కొత్త వ్యక్తులను విచారిస్తున్నారు. అశ్వాపురం మండలం మిట్టగూడెం లో వాహనాల తనిఖీల ను మణుగూరు ఏ ఎస్ పీ శబరిష్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీ ఐ సట్ల రాజు, ఎస్ ఎస్ ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: