ప్రారంభించిన ఎంపీపీ కారం విజయకుమారి
మన్యం టివి మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామ
పంచాయితీ పరిధిలో ఉన్న ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను గురువారం మణుగూరు ఎంపీపీ కారం. విజయ కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కారం. విజయకుమారి,వ్యాక్సిన్ సెకండ్ డోస్ ను వేసుకున్నారు.ప్రజలు అందరు కూడా వ్యాక్సిన్ వేపించుకోవాలని కోరారు. ప్రజలకు వ్యాక్సిన్ సెంటర్ దూరం అవ్వడంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు అని గ్రహించి,వ్యాక్సిన్ సబ్ సెంటర్లను పెట్టడటం జరిగింది తెలిపారు. ప్రతి పంచాయతీ లో వ్యాక్సిన్ సబ్ సెంటర్ పెడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు,మణుగూరు డాక్టర్ మౌనిక,సమితి సింగారం సర్పంచ్ బచ్చల.భారతి, ఎంపీటీసీ గాజుల రమ్య, ఉపసర్పంచ్ పుచ్చకాయల. శంకర్,వార్డు మెంబర్లు బర్మావత్. నర్సింహారావు,కణితి.ప్రవీణ్, ఉపేంద్ర,విజయలక్ష్మీ మరియు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: