రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
గుండాల మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు
గుండాల జూలై 10 (మన్యం మనుగడ) మారుమూల మండలమైన గుండాల లో ఇద్దరు మంత్రులు పర్యటించి పాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మండలంలో ఎల్ డబ్ల్యూ ఎస్ నిధులతో చేపట్టిన పలు వంతెనలను ప్రారంభించారు. దానితోపాటు మల్లన్న వాగు పై నిర్మించిన చెక్ డ్యాముల ను వారు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన మండల కేంద్రంలోని రైతు వేదికను దానితోపాటు కాచన పల్లి గ్రామంలోని రైతు వేదికను మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తో కలిసి వారు ప్రారంభించారు. వీటితో పాటు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గిరిజన సహకార సంస్థ భవనాన్ని వారు వారు ప్రారంభించారు. మారుమూల మండలమైన గుండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో రేగా కాంతారావు ముందుకు తీసుకెళ్తున్నారని వారు కొనియాడారు
Post A Comment: