CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నామవరం గ్రామంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలు

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి ప్రియాంక ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం. అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామపంచాయతీ పరిధిలోని నామవరం గ్రామంలో గత రెండు రోజుల క్రితం కరోనాతో ఒకరు మృతి చెందగా, మరికొందరు అస్వస్థతతో బాధపడుతున్నారని, గుర్తించిన గ్రామ పంచాయితీ సర్పంచ్ సవలం రాణి. గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని వైద్య అధికారులను కోరగా, స్పందించిన వైద్య అధికారులు రాపిడ్ యాంటిజెన్ టెస్టుల మొబైల్ క్యాంపును నామవరం గ్రామంలో ఏర్పాటు చేసి,123 మంది గ్రామస్తులకు టెస్టులు చేయగా, ఐదుగురు వ్యక్తులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వ్యక్తులకు, వైద్యాధికారిణి ప్రియాంక. ఐసోలేషన్ కిట్లను అందజేసి, తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం గురించి వివరించారు. అంతేగాక ప్రజలు అస్వస్థతగా ఉన్నప్పుడే, ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని. నిర్లక్ష్యం చేయవద్దని కోరుతూ, కరోనా వ్యాధి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు. ఈ కరోనా నిర్ధారణ టెస్టుల కార్యక్రమంలో డిపిఎంఓ- ఐ వి వెంకటేశ్వరరావు, హెచ్ఈఓ- పోలెబోయిన కృష్ణయ్య, మొబైల్ టెస్టింగ్ క్యాంప్ ల్యాబ్ అసిస్టెంట్-ఎన్ క్రిస్టోఫర్, సర్పంచ్-సవలం రాణి, ఎంపీటీసీ-బి సీతామహాలక్ష్మి ఎంపీహెచ్ఏ(ఎఫ్)-కే జయ, ఆశాలు- శిరోమణి, నాగమ్మ, జ్యోతి, గ్రామ పంచాయతీ సిబ్బంది-కోట కిరణ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: