మన్యం టీవీ.కొత్తగూడెం, జూలై 12 :- అభి హెల్ప్ లైన మరియు ఎడ్యుకేషనల్ సొసైటి సంస్థ వారి సహకారంతో అక్షర భారత్ - అక్షర వెలుగు విద్య ప్రాజెక్ట్ విద్యాబోధన కేంద్రాన్ని కొత్తగూడెం మండలం మునిసిపాలిటీ పరిధిలో బర్మకాంప్ 13వ వార్డ్ లో సోమవారం నాడు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్,వంచార్ల విమల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకరిమీద ఆధారపడకుండా చదువుకోవాలని చదువు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మానవ మేధాశక్తిని పెంపొందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో 13వ వార్డ్ కౌన్సిలర్ వంచార్ల విమల, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె.స్వర్ణలత, మండల కోఆర్డినేటర్ ఎం.జాయ్ క్రిస్టల్, విలేజ్ కోఆర్డినేటర్ ఎం.శ్వేత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: