మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణం లో గెస్ట్ హౌస్ వీధిలో నివాసముంటున్న యుపిఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కొడమంచిలి సత్యవతి ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నారు. ఆ తర్వాత శ్వాస పరమైన సమస్యలు తలెత్తడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. అశ్వారావుపేట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన సేవలందించారు. విధీ నిర్వహణలో ప్రతిభ కనబర్చి అందరికి సుపరిచితురాలైన సత్యవతి మేడం మృతి పట్ల అశ్వరావుపేట కు చెందిన పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులు సంతాపం తెలిపారు.
Post A Comment: