ప్రాణాలకు తెగించి కిన్నెరసాని దాటుతున్న ప్రజలు
నిత్యం కర్రల వంతెన పై రాకపోకలు
కిన్నెరసాని ఉప్పొంగి తే ఇదే దుస్థితి
గుండాల జూలై 12 (మన్యం మనుగడ) ఇల్లు చేరాలంటే సర్కస్ ఫీట్ చెయ్యాల్సిందే ప్రాణాలకు తెగించి కిన్నెరసాని నది ని దాటాల్సి నా పరిస్థితి నెలకొంది. నిత్యం కర్రల వంతెన సహాయంతో కిన్నెరసాని ఉప్పొంగి నప్పుడల్లా గిరిజనులు పడుతున్న బాధలు. మండలం పరిధిలోని మోదుగుల గూడెం గ్రామ సమీపంలో గల కిన్నెరసాని నది ప్రవహిస్తూ ఉంటుంది. మోదుగుల గూడెం, తూరు బాకా, గ్రామాల ప్రజల వ్యవసాయ భూమి అవతల ఒడ్డున ఉండటంతో ఉదయం కిన్నెరసాని ప్రవాహం మామూలుగా ఉండటంతో దానిలోనుండి నడుచుకుంటూ వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చే సమయానికి భారీ వర్షానికి కిన్నెరసాని ఉధృతంగా ప్రవహించడంతో రెండు బంధాలకు కర్రల వంతెన ను ఏర్పాటు చేసుకుని రెండు గ్రామాల ప్రజలు కర్రల వంతెన పై ప్రమాదమని తెలిసినా ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వాగును దాటారు
Post A Comment: