మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డి పల్లి మండలం, పెంట్లం గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి పాదయాత్ర కార్యక్రమంను సర్పంచ్ సవలం రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో ప్రణాళిక రూపొందించి,చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి, ఇతర సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పి రమేష్, గ్రామ పంచాయతీ స్పెషల్-ఆఫీసర్ దుర్గారావు, వార్డు మెంబర్లు, ఆశా కార్యకర్తలు ,కో ఆప్షన్ నెంబర్, గ్రామ పెద్దలు ,తదితరులు, పాల్గొన్నారు.
Post A Comment: