మన్యంటీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలం లో పలు సమస్యలను లిఖిత పూర్వకంగా వ్రాసి మంత్రి పువ్వాడని కలిసి వినితి పత్రం అందజేసినా నారాయణ పురం సొసైటీ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ నిర్మల పుల్లారావు అశ్వారావుపేట మండల సమస్యలు మరియు గుమ్మడవల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ రిపేర్ నిమిత్తం వెంటనే స్పందించిన మంత్రి పువ్వడా తక్షణ సాయం కింద తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చి రిపేర్ వెంటనే చేయమని ఇరిగేషన్ ఎస్ఈకి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిదంగా నారాయణ పురం సబ్ స్టేషన్ మరియు సొసైటీ భవనము ప్రారంభోత్సవానికి మండలానికి వస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి పువ్వాడా స్పందనకు డిసిసిబి డైరెక్టర్ నిర్మల పుల్లారావు సంతోషం వక్త పరుస్తూ తెలంగాణ రాష్ట్ర శివారు అయిన గుమ్మడవల్లి, నారాయణ పురం గ్రామాలను గుర్తుంచుకున్నందుకు అంటూ మంత్రి పువ్వడాకి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో డిసిసిబి వైష్ చైర్మన్ పుట్టా సత్యం, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: