మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని గిరిజన విద్యార్థుల కొరకు 2021- 22 విద్యా సంవత్సరానికి మూడో తరగతి, 5వ తరగతి, మరియు ఎనిమిదో తరగతి లో బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ఎంపిక కొరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ తెలంగాణ హైదరాబాద్ వారి ద్వారా ములుగు జిల్లాకు 50 సీట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 25 సీట్లు కేటాయించబడాయని ఈ సిట్లు భర్తీ చేయడానికి ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ(జులై 1 నుండి 8 )వరకు దరఖాస్తులు స్వీకరించబడిన సంబంధిత దరఖాస్తులు ఫారాలు డిప్యూటీ డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఏటూరునాగారం నందు లభించునని ప్రాజెక్టు ఆఫీసర్ హనుమంతు కె జండా గే బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు తల్లిదండ్రులు సంబంధిత ధ్రువపత్రాలను జతపరిచిన దరఖాస్తులను జులై 15 ఉదయం11 గంటలకు ఐటిడిఎ సమావేశపు హాలునందు హాజరైనట్లు అయితే విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీడ్రా ద్వారా ఎంపికైన విద్యార్థులను భర్తీ చేస్తామని ఒక ప్రకటనలో పిఓ తెలిపారు.
Post A Comment: