మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటువంటి ఆహారభద్రత కార్డుల కార్యక్రమాన్ని మండల తాసిల్దార్ దేవా సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఈ కార్యక్రమానికి భూపాలపల్లి,ములుగు జిల్లాల రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పల్ల బుచ్చయ్య ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.బుచ్చయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని నిరుపేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదని దృఢ సంకల్పంతో కొత్త రేషన్ కార్డులు విడుదల చేసి అర్హులైన నిరుపేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని సూచించారు.అలాగే ములుగు జిల్లాలో వెలసియున్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చరిత్రాత్మక దేవాలయంగ గుర్తించారు. ఇప్పటి వరకు చెక్కుచెదరకుండా ఉన్నది. అంటే సాక్షాత్తు రామ లింగేశ్వరుడు కాపాడుకుంటూ ఉన్నాడని భక్తుల నమ్మకం రామప్ప దేవాలయానిప్రపంచ దేశాలు గుర్తించే విధముగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కృషి చేశారని వారికి జిల్లా ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ,ఎంపీపీ జనగాం సమ్మక్క,వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్,స్పెషల్ ఆఫీసర్ వెంకయ్య,సర్పంచ్ ప్రభాకర్,మౌనిక,పద్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: