మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ తో వరి విత్తనాలు వేసిన పోలాలను సందర్శించారు. రైతులు ఈ సంవత్సరం వరి నాట్లు వేయకుండా నేరుగా విత్తనాలను వరి పొలంలో సీడ్ కమ్ పెర్టిలైజర్ డ్రిల్ తో వేసారు. ఈ పద్దతిలో విత్తన మోతాదు 10 Kg లు మాత్రమే ఎకరానికి సరిపోతుంది. ఖర్చు కూడా తక్కువ. కూలీల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.అధికారులు రైతులకు కలుపు నివారణకు తగిన సూచనలు సలహాలను ఇచ్చారు. రైతులు కూడా ఈ సంవత్సరం వచ్చిన దిగుబడిని చూసి వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ మొత్తంలో సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ తో విత్తనాలను వేస్తాము అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మణ్ రావు , కేశవ్ రావు లతో పాటు రైతులు పాల్గొన్నారు.
Post A Comment: