ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నవీన్ మృతి
నవీన్ స్వగ్రామం ఇల్లందు మండలం ఎల్లాపురం గ్రామం
గుండాల జూలై 20 (మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. గుండాల ఇల్లందు మార్గ మధ్యలో కాచన పల్లి అటవీ ప్రాంతంలో లారీ ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. గుండాల మండల కేంద్రంలో ఎరువుల దిగుమతి చేసి లారీ తిరిగి వెళుతున్న గ్రామంలో లారీ ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొనడంతో ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బలంగా లారీ ఢీకొనడంతో నవీన్ లారీ కింద నుండి వెనక వైపుకు వెళ్లడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన ప్రయాణికులు వన్ జీరో ఎయిట్ సమాచారం ఇవ్వడంతో వన్ జీరో ఎయిట్ వాహనంలో ఇల్లందు తరలిస్తుండగా మృతి చెందాడు. నవీన్ మృతిచెందడంతో ఎల్లాపురం గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి
Post A Comment: