కోవిడ్ నిబంధనలతో బక్రీద్ ప్రార్థనలు జరుపుకోవాలి సిఐ
మన్యం టీవీ, అశ్వాపురం:బక్రీద్ పండుగ వేడుకలు, ఈద్గాల వద్ద నిర్వహించే ప్రార్ధనలు కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అశ్వాపురం సి.ఐ రాజు సూచించారు.
బక్రీద్ పర్వదిన సందర్బంగా అన్ని ఈద్గా వద్ద అవసరమైన చర్యలు తీసుకోవలని, ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో విధిగా మాస్కులు ధరించడం, ఈద్గాల పరిసరాలను సానిటైజ్ చేయడం లాంటి చర్యలు తప్పనిసరి అని తెలిపారు. బక్రీద్ పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని గుర్తు చేశారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అశ్వాపురం సిఐ సట్ల రాజు కోరారు.
Post A Comment: