CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Share it:

 


*రాష్ట్ర మరియు,ములుగు  నియోజకవర్గంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలి.

*శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో పూజలు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలో ప్రేమ్ నగర్ శ్రీ షిర్డీసాయి బాబా ఆలయం దివ్య సన్నిధిలో 

గురు పౌర్ణమి రోజున ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ దైవ దర్శనం చేసుకున్నారు.ప్రత్యేకంగా ములుగు జిల్లా ప్రజల సుఖ శాంతులకోసం,పురపాలక,ఐటీ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలను చేశారు.రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి.

మంచి పంటలు పండి రైతులు,రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్  తనయుడు ఐటీ,పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్

యువతకుమార్గదర్శిగా,తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల సేవ చేయాలి అని కేటీఆర్ గారి ములుగు జిల్లా ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సాయిబాబు ఆలయంలో దేవుడికి పూజ కార్యక్రమలు నిర్వహించాము అని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తెలిపారు.అతివృష్టి వనాలు కురిసినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని  అన్నారు.అనంతరం జడ్పీ కార్యలయంలో కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు.

వీరి వెంట ఎంపీపీ లు గండ్ర కోట శ్రీదేవి సుదీర్,బుర్ర రజిత సమ్మయ్య,జిల్లా నాయకులు పోరిక గోవింద్ నాయక్,గండ్ర కోట సుదీర్ తాహిర్ పాషా,ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,దళిత జన సేవ సమితి అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య,ములుగు మండల అధ్యక్షులుబాదంప్రవీణ్,వెంకటాపూర్ మండల అధ్యక్షులు కూరేళ్ల రమాచారి,ములుగు మండల ఎంపీటీసీలు మాచర్ల ప్రభాకర్,పోరిక విజయ్ రాం నాయక్,సత్యనారాయణ,గొర్రె సమ్మయ్య,మండల అధికార ప్రతినిధి ముడతానపల్లి మోహన్,రైతుబంధు అధ్యక్షులు కుటుంబరావు,సీనియర్ నాయకులు వేల్పురి సత్యనారాయణ,పిఎసియస్ గోవిందరావు పేట డైరెక్టర్ దూడపాక రాజేందర్,ఉట్ల మోహన్,బీసీ నాయకులు రవి రామన్,పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్,

గడ్డమీద భాస్కర్,యువజన నాయులు పొలం శ్రావణ్,తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: