ఏడూళ్ల బయ్యారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ముక్కోటి వృక్ష ర్చన లో భాగంగా ఏడూళ్ల బయ్యారం అటవీశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పినపాక మండలం జానంపేట గ్రామం శివారులోని అటవీశాఖ భూమిలో పినపాక మండల ప్రజా ప్రతినిధులతో కలిసి అటవీశాఖ సమక్షంలో రేగా కాంతారావు మొక్కలు నాటడం జరిగింది .ఈ సందర్భంగా రేపు రేగా కాంతారావు మాట్లాడుతూ, ముక్కోటి వృక్షార్చన లో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, టిఆర్ఎస్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య , మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, జానంపేట సర్పంచ్ బాడిస మహేష్, ఏడూళ్ల బయ్యారం అటవీ క్షేత్ర అధికారి తేజస్విని, డిఆర్ వో అరుణ, బీట్ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది
Post A Comment: