CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రోటోకాల్ పాటించని ఎంపీడీవో పై చర్యలు తీసుకోవాలి

Share it:

 


 గుండాల /ఆళ్ల పల్లి జూలై 16 (మన్యం మనుగడ) ప్రోటోకాల్ పాటించని ఆళ్ల పల్లి మండల ఎంపీడీవో మంగమ్మ పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు శుక్రవారం ఆళ్ల పల్లి మండలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ. గత వారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు మండలంలో పర్యటించినప్పుడు అదే రోజు సాయంత్రం ఎవరికీ పిలవకుండా స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీటీసీ తో కలిసి ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతి వనాన్ని ప్రారంభించారు అన్నారు. స్థానిక ఎంపీపీ కి స్థానిక జడ్పిటిసి కి మరియు వార్డు మెంబర్లకు కూడా సమాచారం ఇవ్వకుండా పల్లె ప్రకృతి వరాన్ని ప్రారంభించిన ఎంపీడీవో పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పల్లె ప్రకృతి ఏర్పాటుచేసిన స్థలం వివాదంలో ఉండటంచేత దాన్ని ప్రారంభం వాయిదా వేసినప్పటికీ ఎంపీడీవో కావాలనే ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొమరం హనుమంతు, ఎంపీపీ మంజు భార్గవి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, టిఆర్ఎస్ నాయకులు బాబా, ఖయ్యుం, స్థానిక సర్పంచులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: