కోవిడ్19 నిబంధనలు ఎవ్వరైనా ఉల్లంఘిస్తె చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఎస్ఐ ప్రవీణ్ కుమార్
మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని వివిధ గ్రామల ప్రజలు మాస్కు దరించి భౌతికధూరం పాటించకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాల వ్యాపార సముదాయాల్లో కిరాణా షాపులు కూరగాయలు చికెన్, మటన్ షాపులలో తదితర ప్రాంతాలలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మాస్క్ లేని యెడల 1000 రూపాయలు జరిమాన విధించక తప్పదన్నారు.ప్రతి ఒక్కరు వీదగా మాస్క్ దరించి పోలిసులకు సహకరించాలని అన్నరు.అలాగే దుకణాదారులు వారి షాపుల ముందు బాక్సు లు గిచి ఉంచాలని ఎవ్వరైన వ్యక్తులు మాస్క్ లేకుండా వస్తే వారికి సామాన్లు ఇవ్వవద్దని అన్నారు. ప్రజలందరూ కోవిడ్ 19 నిబంధనలు పాటించి మాస్క్ సక్రమంగాధరించాలి ఎవ్వరైతే మాస్క్ సక్రమంగా ధరించరో వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిచబడుతుందని అయన తెలిపారు.
Post A Comment: