మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు- సిద్దెల తిరుమలరావు.
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట లో జరిగిన మాదిగ జేఏసి సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాదిగ జేఏసి జిల్లా అధ్యక్షులు సిద్దెల.తిరుమలరావు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధనకై 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 26, 27 న ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిధులు మాదిగ జేఏసి వ్యవస్థాపకులు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి హాజరవుతారని, ఈ కార్యక్రమానికి మాదిగ జేఏసి దళిత సంఘాల నాయకులు అందరూ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల నాయకులు అందరూ భారీగా తరలి రావాలని చలో ఢిల్లీ కార్యక్రమం ను విజయవంతం చేయాలని మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష సిద్దెల తిరుమలరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తోకల శ్రీను, నియోజకవర్గ అధ్యక్షులు గంగారపు రమేష్ , కొప్పుల సందీప్, పూస శ్రీను, లాలయ్య, ఉపేందర్, వెంకటేశ్వర్లు, శ్రీను, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు
Post A Comment: