CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిపిఐ నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ రాస్తా రోకో...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు,

జులై 27, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి షాబీర్ పాష లను అక్రమంగా అరెస్టు చేశారంటూ సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న పేద ప్రజల ఇండ్లను రైల్వే శాఖ అధికారులు కూల్చివేయడం సరైనది కాదని పేదల పక్షాన నిలబడి నందున అక్రమంగా అరెస్టు చేశారని దానికి నిరసనగా రాస్తా రోకో నిర్వహించామని తెలిపారు. వెంటనే సిపిఐ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ జంపాల కార్తీక్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని నాయకులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లంకి మధు, చింతా స్వరాజ్ రావు, ఎస్ కె నాగులు మీర, దేవినేని జనార్ధన్, గార్లపాటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: