మన్యం టీవీ : జూలూరుపాడు,
జులై 27, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో నాగుల్ మీరా మిత్ర బృందాన్ని టిఆర్ఎస్ నాయకులు లేళ్ళ గోపాల్ రెడ్డి మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి బారినపడి మండల వ్యాప్తంగా మృతి చెందిన ఎంతోమందికి నాగుల్ మీరా తన మిత్ర బృందంతో దహన సంస్కారాలు నిర్వహించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో కరోన మృతదేహం వద్దకు సొంత కుటుంబీకులు, దెగ్గరి బంధువులు, ప్రాణ స్నేహితులు, సైతం దరి చేరని సమయంలో చిన్న వయస్సులోనే విశాల హృదయంతో "మానవసేవే మాధవసేవ" అనే సూక్తిని ఆచరిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తిని వారి మిత్ర బృందాన్ని సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం వారికి మాస్కులు శానిటైజర్ లు పంపిణీ చేశారు. నాగుల్ మీరా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని, కోరారు. కరోనా కష్ట సమయంలో మా వంతు సేవాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ సేవలను గుర్తించి సన్మానించిన లేళ్ళ గోపాలరెడ్డి మరియు వారి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, అఖిల్, వంశీ, పవన్, సంపత్ చిల్లంగి, కిరణ్, సమీర్, బాడిస వీరబాబు (నాని) పదిమల చందర్ రావు, టి వీరబాబు, హరీష్, రాజేష్, అబ్బాస్, రమేష్, నరేందర్ రెడ్డి, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: