మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలంలోని చింతల బయ్యారం గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కొమరం లక్ష్మణ్ రావు , కేశవ్ రావు , రమేష్ బెంగాలి కూలీలతో కలిసి కంటిపూడి వెంకన్న బాబు పోలంలో వరినాట్లు వేసినారు. ఈ బెంగాలి కూలీలు వరినాట్లను ఒక క్రమ పద్దతిలో వరుసగా సాలుకు సాలుకు మొక్కకు మొక్కకు మధ్య ఖచ్చితమైన దూరాన్ని పాటించి నాటు వేస్తారు. దీనివలన మొక్కలకు గాలి, వెలుతురు మంచిగా లభించి, ఎలాంటి చీడ, పీడల బెడద లేకుండా మొక్క ఆరోగ్యంగా పెరిగి దుబ్బులు కూడా ఎక్కువగా వచ్చి దిగుబడి కూడా పెరుగుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ మంది కూలీలతో ఎక్కువ విస్తీరణంలో నాటు వేస్తారు. ప్రతి రెండు మీటర్లకు కాలి బాట ఉంటుంది కనుక రైతు ఎరువులు, పురుగు మందులు వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కనుక ప్రత్యేకంగా కాలిబాటలు కూడా తయవలసిన అవసరం లేదు .వీరితో నాటు వేయించడం వలన రైతుకు కూలీల ఖర్చు , కలుపు మందులు, పురుగు మందులకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. విత్తన మోతాదు కూడా 10-15 కేజీలు ఎకరానికి సరిపోతుంది. నారు కూడా అనవసరంగా వృధా కాదు . వీరు మొక్కను బురద నెలలో నిటారుగా వేస్తారు. దీని వలన దుబ్బులు తొందరగా పెరిగి, ఒక దుబ్బుకు సుమారుగా 50 పిలకలు వచ్చి దిగుబడి బాగా వస్తుంది. ఈ పద్దతిలో దిగుబడి 4 - 5 బస్తాలు అదనంగా వస్తుంది.
Post A Comment: