CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ అరెస్టును ఖండించండి. ఐద్వా....

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు 


నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన కెసిఆర్ ప్రభుత్వం ,ఇల్లు ఇవ్వకుండా కట్టుకున్న ఇల్లు ని సైతం కూల్చివేయడం అమానుష చర్య అని ఐద్వా  ఇల్లందు మండల కార్యదర్శి ఆలేటి సంధ్య పేర్కొన్నారు. కమ్యూనిస్టులు పేదల పక్షాన ఉండి ఇళ్లను కూల్చకుండా చేస్తారని భయంతో సిపిఐ సిపిఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని వాపోయారు .సుమారు 40 ఏళ్ల నుంచి కొత్తగూడెంలోని స్టేషన్ పక్కన గల మేదరిబస్తిలో.నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి పేదలను నిర్ధాక్షణ్యంగా తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటి సామాన్లు, మనుషులను బయటకు నెట్టివేసి  కూల్చివేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గుమాలిన చర్య అని అన్నారు .ఇప్పటికైనా ఆ ప్రాంత ప్రజలకు పక్కా ఇళ్లు నిర్వహించి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని లేనిపక్షంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎండి జేబున్నీసా, అప్సర, కాంతమ్మ పద్మ ,వెంకటమ్మ ,కడారి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: