మన్యం మనుగడ వెబ్ డెస్క్,ఖమ్మం:
ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దిష్టి బొమ్మని దగ్ధం చేసి మాట్లాడిన మధిర నియోజకవర్గ తెరాస మాజీ ఇన్చార్జి బొమ్మెర రామ్మూర్తి
ఈరోజు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది .
ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను (మాదిగలను) తక్కువ చేసి మాట్లాడటం, మాదిగ సమాజాన్ని దూషిస్తూ దుర్భరమైన పదజాలాన్ని వాడుతూ మాదిగలను బూతులు తిట్టిన్నందుకు నిరసనగా ఈటెల రాజేందర్ బామ్మర్ది మదుసుదన్ రెడ్డి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చర్యలకు పాల్పడిన వ్యక్తులపై *ఎస్సీ ఎస్టీ* అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాదిగ డెవలప్మెంట్ ఫోరం[MDF] సభ్యులు మరియు ఖమ్మం తెరాస పార్టీ మాదిగ నాయకులు, యువనాయకులు గొల్లమందల మోహన్ చైతన్య, చేకురి సతీష్ మహాజన్,అర్జున్, వీరాంజనేయులు, రాంబాబు, రామారావు ,ప్రేమ్ కుమార్ మొదలగు పాల్గొన్నారు.
Post A Comment: