CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమార్కుల చెరలో అంతరించిపోతున్న గుట్టలు..

Share it:

 



👉 అర్ధరాత్రి అక్రమ మట్టి తోలకాలు..


👉 నిద్ర నటిస్తున్న అధికార యంత్రాంగం..


మన్యం టీవీ : జూలూరుపాడు,

జూలై 29, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో అక్రమ మట్టి మాఫియా దందా జోరుగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా చడీ చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లు, టిప్పర్లతో, దూరప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు. అసైన్మెంట్ భూములు, గుట్టలను, అడ్డాగా మార్చుకొని అడ్డూ అదుపు లేకుండా దందాను కొనసాగిస్తున్నారు. దీంతో నేడు చూసిన దృశ్యం రేపటికి కనుమరుగవుతోంది. గుట్టలన్ని గుంతలు గా దర్శనమిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ వీరికి చుట్టాలుగా మారాయ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం నిద్ర నటించడంలో ఆంతర్యమేమిటాని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో బుధవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో పడమట నర్సపురం రెవెన్యూ పరిధిలో అక్రమ మట్టి తోలకం కొనసాగుతుండగా గమనించిన స్థానికులు పోలీస్ శాఖకు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో జెసిబి ని రెండు టిప్పర్ల లను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇకనైనా అక్రమ మట్టి దందాను అదుపు చేయాలని, అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిద్ర నటిస్తున్న అధికార యంత్రాంగం మేల్కొని ప్రకృతి వనరులను కాపాడాలని స్థానిక ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: